తిరుపతి : తిరుపతి జిల్లా పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతిచెందారు. సి.మల్లవరం వద్ద కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో తల్లికుమారుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.