అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కు ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) శనివారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి కోసమే తపిస్తారని మోదీ అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్(Pawankalyan) కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా, పరిపాలనపరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని , నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారని అన్నారు. ఏపీలో వైసీపీ పెట్టిన కేసులతో జైల్లో ఉన్నా కూడా మనోనిబ్బరం కోల్పోలేదని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడని కొనియాడారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో..
ఏపీలోని టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ, బీసీ సెల్, పార్టీనేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బీసీ సెల్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ట్రాలీపై భారీ కేక్ తీసుకొచ్చి కట్ చేశారు.