హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తన కూతురు పల్లవికి కులాంతర వివాహం జరిపించారు. ఆ యువతి ప్రేమించిన పవన్ అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో ఈ పెళ్లి చేశారు.
అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. తన మొదటి కూతురు తాను కలిసి చదువుకొన్న పవన్ను ఇష్టపడటంతో ఇద్దరినీ ఆశీర్వదించానని, డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా ఈ వివాహం జరిపించానని అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.