Roja | వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో టీడీపీ కోవర్టులున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు మంత్రి రామచంద్రారెడ్డి పేరు చెప్పుకుంటూ బయట వసూళ్లకు పాల్పడుతున్నారని, బయట తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. పార్టీలోనే ఉంటూ కోవర్టులుగా పనిచేస్తున్న వారితో పార్టీకి చెడ్డ పేరువస్తుందని, అధిష్ఠానం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన వర్గం వారు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఓ వర్గం వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై చర్య తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ సెంథిల్ను కోరారు.