Crime News | బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్పై శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలో కొందరు దుండగులు దాడి చేశారు. కావలి ట్రంక్ రోడ్డు వద్ద అడ్డం ఉన్న టూ వీలర్ తొలగించాలని బస్సు డ్రైవర్ హారన్ మోగిస్తే.. సదరు టూ వీలర్ యజమాని వాగ్వాదానికి దిగాడు. స్థానిక పోలీసులు సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపివేశారు.
కానీ సదరు వ్యక్తి ఈ సంగతి తన స్నేహితులకు చెప్పాడు. అతని మిత్రులు 14 మంది కారులో ఆర్టీసీ బస్సును వెంటాడారు. కావలి పట్టణ శివారుల్లో మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్ వద్ద అడ్డుకున్నారు. బస్సు డ్రైవర్ను దుర్భాషలాడి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనను వీడియో తీస్తున్న ప్రయాణికుడిపైనా దాడి చేసి ఆ ఫోన్ ధ్వంసం చేశాడు. ఈ సంగతి తెలియగానే కావలి రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ను చికిత్స కోసం స్థానిక దవాఖానకు తరలించారు.
నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. బస్సు డ్రైవర్పై అనుచితంగా వ్యవహరించిన నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.