తిరుమల: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని ఏపీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, రోజా, ఏపీ ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీవారి ఫొటోను అందజేశారు.
మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు అనునిత్యం అధికార పార్టీపై దాడులు చేస్తున్నాయని అన్నారు. గతంలో ఏ విపక్షమూ ప్రభుత్వంపై ఇలా విరుచుకు పడలేదని ఆరోపించారు. తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 31 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.