మచిలీపట్నం: క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.”లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే మానవ జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లవచ్చని” ఆయన అన్నారు. ” కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ క్రీస్తు జన్మదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపు కోవాలని మంత్రి పేర్ని నాని ఆకాంక్షించారు.
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం ఇదీ జీసస్ మానవాళికి ఇచ్చిన మహోన్నతమైన సందేశం” అని ఆయన తెలిపారు.