పదో తరగతి పరీక్షల సందర్భంగా అవకతవకలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే నిందితులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు కట్టుదిట్టంగానే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరిగితే, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని బొత్స ఫైర్ అయ్యారు. పదో తరగతి పేపర్ లీకేజీల విషయంలో 60 మందికి పైగా చర్యలు తీసుకున్నామని, అలాగే 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
6 నుంచి 24 వరకూ ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, 10 లక్షల మంది ఈ పరీక్షలు రాస్తున్నారని ఆయన ప్రకటించారు. అవసరమైతే పరీక్షల గదుల్లో సీసీ టీవీలు కూడా అమర్చేందుకు రెడీ అని మంత్రి ప్రకటించారు. టెన్త్ పరీక్షల పేపర్ల లీక్ విషయంలో ఆయా సంస్థలపై తగు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్స్లు కూడా రద్దు చేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.