అమరావతి : కర్నూలు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మేకపాటి విక్రమ్రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఛాంబర్లో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మేకపాటిని శాలువాతో సన్మానించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు వైసీపీ నాయకులు మేకపాటికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోదరుడు గౌతమ్ ఆశయాలను నెరవేరుస్తానన్నారు. గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఖాళీ అయిన ఆత్మకూరు స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నికను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగి విక్రంరెడ్డి పోటీచేయగా ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.