అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులతో పీఆర్సీ పై సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం పంపింది. రెవెన్యూ, ఎన్జీవో, సచివాలయం, ఉద్యోగుల సంఘం నేతలకు ఆహ్వానం పంపింది.
అధికారులు, మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ సంఘాల సమస్యలతో పాటు సీపీఎస్, జీపీఎస్ అంశాలపైనా మరోసారి చర్చించే అవకాశముంది.