అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మరి కొద్ది సేపట్లో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జరుగనుంది. కేబినెట్ సమావేశం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఈ భేటీలో పలు అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలిసింది. దేవాదాయ భూముల ఆక్రమణల నిరోధానికి చట్ట సవరణ ప్రతిపాదన, అమ్మ ఒడి పథకం, దుల్హన్ స్కీంపై చర్చ జరపనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యే వరకు కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణపై చర్చించి ఆమోదించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.