అమరావతి : కడప నగర మేయర్ సురేశ్బాబు శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. ఆయన మెదడులో స్వల్పస్థాయిలో రక్తస్రావం అయ్యిందని వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.