అమరావతి : ఏపీలో సీపీఎస్ను రద్దు చేయాలంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు తిరుపతిలో ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి బస్టాండ్ వరకు 13 జిల్లాలకు చెందిన ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగుల పాల్గొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీతో గద్దె నెక్కిన జగన్ చర్చలతో కాలయాపన చేస్తున్నారని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆరోపించారు. మూడు సంవత్సరాలు కావాస్తున్న సీపీఎస్ను ఎందుకు రద్దు చేయడం లేదని విమర్శించారు.
సీపీఎస్ను రద్దు చేయాండి లేదా గద్దె దిగాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీపీఎస్ను రద్దు చేయక పోతే భవిష్యత్ పోరాటాలకు పిలుపునిస్తామని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న పెన్షన్ను తొలగించడం అన్యాయమని, ఇప్పటికైనా రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాలో సీపీఎస్ను రద్దు చేశాయని అదేవిధంగా ఏపీలో కూడా ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్యే ప్రభుత్వానికి సూచించారు.