లక్నో : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ ఇంద్రాపూర్ ప్రాంతంలోని జైపురియా షాపింగ్ మాల్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆస్తినష్టంపై ఇప్పుడే అంచనాకు రాలేకపోతున్నామని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు.
భారీ భవనాల మధ్య షాపింగ్ మాల్ ఉండటం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి