గుంటూరు జిల్లా : మంగళగిరిలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి టీడీపీ కీలక నేతగా ఉన్న గంజి చిరంజీవి ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు టీడీపీ న్యాయం చేయకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు రాజీనామా అనంతరం ఆయన మీడియా ఎదుట వెల్లడించారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్గా, 2014 లో ఎమ్మెల్చయే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. గంజి చిరంజీవి రాజీనామాతో మంగళగిరిలో నారా లోకేశ్ వర్గానికి తీరని లోటు రానున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత గంజి చిరంజీవి పార్టీకి రాంరాం చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అందులో చేరగా.. ప్రస్తుతం నేతి బీర చందంగా తయారైందని విచారం వ్యక్తం చేశారు. చేనేత కులానికి చెందినవాడినైనందునే పార్టీలోని కొందరు తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని ఆరోపించారు. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లను భరించే శక్తి లేకపోవడం వల్లనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలే తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశారని దుమ్మెత్తిపోశారు. మంగళగిరి టికెట్ తనదే అని చెప్పిన పెద్దలు.. చివరకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని ఇచ్చి మంగళగిరి తనను దూరం చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు న్యాయం చేసే వారితోనే తాను నడుస్తానని, తనను అభిమానించే వారు, తన అనుచరులతో సంప్రదించి చర్చించిన మీదటనే నిర్ణయం తీసుకుంటానని గంజి చిరంజీవి వెల్లడించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన గంజి చిరంజీవిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా టీడీపీ అధిష్ఠానం నియమించింది. 2019 ఎన్నికల్లో నారా లోకేశ్ మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకోవడంతో.. గంజి చిరంజీవికి టికెట్ దక్కలేదు. అయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. లోకేశ్కు ముఖ్య అనుచరుడిగా ఉన్న గంజి చిరంజీవి.. వచ్చే ఎన్నికల్లో కూడా తనకు టికెట్ దక్కదని తెలియడంతో ముందు జాగ్రత్తగా పార్టీ వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తున్నది.