శ్రీశైలం : కారు అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం చెందగా డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ప్లాంట్లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. విద్యుత్ ప్లాంట్లో కేబుల్ మరమ్మతు పనులు చేస్తున్నకార్మికులను తీసుకెళ్లేందుకు కాంట్రాక్ట్ లేబర్ శివలింగం అద్దె కారులో డ్రైవర్ మనోజ్తో కలిసి బయల్దేరాడు. ప్లాంట్ అంతర్భాగానికి వెళ్లే మార్గంలో కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఈ మార్గం పూర్తిగా ఏటవాలుగా ఉండటంతో కారు వేగంగా దూసుకెళ్లి సర్వీస్ బే వద్ద ఉన్న స్పైర్ రన్నరను ఢీకొట్టింది.
దీంతో డ్రైవర్ వెంట కూర్చున శివలింగం తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ మనోజ్కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన ఈగలపెంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. వాహనం స్పైర్ రన్నర్ను ఢీకొట్టిన వేగానికి భారీ శబ్దం రావడంతో ప్లాంటులోనిి కార్మికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.