అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని వలసపల్లెలో పొట్టేలు అనుకుని మనిషి తలను నరికాడో వ్యక్తి. వలసపల్లెలో పశువుల పండుగ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఎల్లమ్మ గుడి వద్ద పొట్టేలును బలి ఇస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తల అనుకుని దానిని పట్టుకున్న వ్యక్తి మెడను నరికాడు. దీంతో టి. సురేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు.
ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పాత కక్షలతోనే హత్య జరిగినట్లు, ప్లాన్ ప్రకారంమే ఇది చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.