తిరుమల : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం మలయప్పస్వామిని చినశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు దారిపోడవునా బారులు తీరి హారతులతో స్వాగతం పలుకుగూ దేవదేవుడిని కనులారా దర్శించుకున్నారు. వాహనం ముందు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఏపీ సీఎం జగన్తో పాటు ఉపముఖ్యమంత్రులు నారాయణ స్వామి, సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేణుగోపాలకృష్ణ, రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి,రెడ్డెప్ప, గురుమూర్తి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ రాత్రి స్వామివారు హంస వాహనాలపై కనువిందు చేయనున్నారు.