తిరుపతి: ఒడిస్సాలోని భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ మంగళవారం నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, చతుర్దశ కలశ స్నపనం జరిపించారు. అనంతరం శ్రీవారి విగ్రహనికి జలాధివాసం , కుంభారాధన, ఉక్త హోమాలు చేపట్టారు.
సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు కలశారాధన, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు దుష్మంత్ కుమార్, డిప్యూటీ ఈవో గుణభూషణ్రెడ్డి, టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి విజయసారధి, వైఖానస ఆగమ సలహాదారు విష్ణుబట్టాచార్యులు, ఏఈవో దొరస్వామి నాయక్, సూపరింటెండెంట్ మల్లికార్జున, అర్చకులు పాల్గొన్నారు.