అమరావతి: అమరావతి రాజధాని కోసం చేపట్టిన రైతుల మహాపాదయాత్ర ఇవాళ పన్నెండో రోజుకు చేరుకుంది. యాత్రకు దారిపొడవున ఉన్న ప్రతి గ్రామంలోని ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గం అరిసేపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర గుడివాడ నియోజకవర్గం లోకి ప్రవేశించి రెడ్డిపాలెం నుంచి వడ్లమన్నాడు చేరుకోనుంది. భోజన విరామం అనంతరం కవతవరం వరకూ దాదాపు 15కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.
ఈ సందర్భంగా పాదయాత్రకు ఏపీలోని పలు రాజకీయ, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి. అమరావతిలో ఇళ్లు కట్టుకున్నానని, ఇక్కడే తాను ఉంటానని చెప్పిన సీఎం జగన్ ఎందుకు మాటా మారుస్తున్నారని జనసేన నాయకుడు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించా రు. అమరావతి రాజధాని అందరికి మధ్యలో ఉందని, అటువంటి రాజధానిని మూడు ముక్కలు చేయడం వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.