అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో 7 ఆసుపత్రుల్లో ఎల్.పి.ఎం యూనిట్లను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గతంలో 8 యూనిట్లను ప్రారంభించామని, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ, రాజాం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో యూనిట్లను రూ.14 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. సమర్థవంతమైన ముఖ్య మంత్రి కోవిడ్ పరిస్థితిని పకడ్బందీగా ఎదుర్కొనడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముందు చూపుతో కోవిడ్ ఏర్పాట్లు చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి. సూర్యా రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణా రావు, ఆసుపత్రి సలహా మండలి సభ్యులు జగన్మోహన రావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి పి. ప్రకాశ రావు, జెడ్పీటీసీ, ఎం.పి.పి, సర్పంచ్, సుడా తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.