తాడేపల్లి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రజలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ బ్యాంకర్లకు సూచించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ సమావేశం ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంలో దేశ ఆర్థికాభివృద్ధి క్షీణించిందని అన్నారు.
కొవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు చేయాల్సిందంతా చేస్తోందని వెల్లడించారు. పక్షపాతం, అవనీతికి తావులేకుండా ప్రత్యక్షంగా లబ్ధిదారుడికి మేలు చేసేలా నగదు బదిలీచేస్తోందని స్పష్టం చేశారు. 2020–21లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19శాతం చేరుకోవడం పట్ల బ్యాంకర్లను అభినందించారు.
కొన్ని రంగాల్లో బ్యాంకర్లలో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. సామాజిక ఆర్థిక ప్రగతిలో విద్య, హౌసింగ్ అత్యంత కీలకమైదన్నారు.