అమరావతి : భర్త లేని మహిళను నమ్మించి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘనుడు కొద్దిరోజులకు వక్రబుద్ధిని ప్రదర్శించాడు. భార్యకు మాయమాటలు చెప్పి ఆమె కూతురుని పెళ్లి చేసుకుంటున్నట్లు ఫొన్ చేయడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించిన విచారకర సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
విజయనగరానికి చెందిన నక్కాన లక్ష్మి భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమెకు 17 ఏళ్ల కుమార్తె ఉంది. కేటరింగ్ చేస్తూ కాలం వెల్లదీస్తున్న ఆమెను ప్రైవేట్ వాహన డ్రైవర్ సురేశ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల తరువాత ఇంట్లో ఉన్న 17 ఏండ్ల కుమార్తెపై కన్నేసిన ఘనుడు తల్లిని నమ్మించి తాను వెళ్లే వాహనంలో ఒక సీటు ఖాళీగా ఉందని నీ కూతురును తిరుపతికి తీసుకెళ్తున్నానని నమ్మించి తీసుకెళ్లాడు.
తిరుపతికి వెళ్లిన తరువాత లక్ష్మికి ఫొన్ చేసి తాము పెళ్లి చేసుకుంటున్నామని ఫొన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో అవాక్కైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.