అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లాలోని అద్దంకి గరటయ్య కాలనీ సమీపంలోని కాకనికుంట వద్ద ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . పెద్దిరాజు(22) అనే యువకుడు, ప్రశాంతి(20) అనే యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.