అమరావతి : ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం యంత్రాల విధ్వంసానికి కారకుడైన వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinneli RamaKrishna reddy) పై పోలీసులు లుకౌట్ నోటీసులు(Lookout notices) జారీ చేశారు. ఎమ్మెల్యే విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తూ అతడితో పాటు అతడి సోదరుడిని అరెస్టు (Arrest) చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు బృందాలు హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేసోదరుల కోసం గాలింపులు చర్యలు మొదలు పెట్టారు. అన్ని ఎయిర్పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు.
ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల (Macharla) నియోజకవర్గంలో పాల్వాయిగేటు పోలీంగ్ కేంద్రంలో వైసీపీ నాయకులు ఈవీఎం యంత్రాలను ధ్వంసం (EVM destruction) చేశారు. ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పెట్టిన ట్వీట్పై ఈసీ స్పందించింది.
ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశిస్తూ సాయంత్రం 5 గంటల లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ సీఈవో ముఖేష్కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేసింది .