అమరావతి: చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. చదువులకు పేదరికం అడ్డురాకూడదని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. విద్య మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని అన్నారు. 2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసానికి గాను విద్యా దీవెన పథకం కింద రూ. 709 కోట్లను జమ చేశారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడారు. అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయిం బర్స్మెంట్ను కల్పిస్తున్నామని ప్రకటించారు.
గత ప్రభుత్వంలోని బకాయిలు రూ. 1,778 కోట్లు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ. 709 కోట్లు జమ చేశామని, మొత్తం 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుం దన్నారు.