అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎక్కడా చెప్పలేదని, అది తమ మ్యానిఫెస్టోలో లేనే లేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. దశలవారీగా మద్యం నియంత్రణ చేస్తామని మద్యం ధరను ఫైవ్స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని ప్రకటించామని ఆయన ఇవాళ మీడియా సమావేశంలో వెల్లడించారు. మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉన్న బార్లను, వైన్స్ల సంఖ్యను తగ్గించామని తెలిపారు.
గతంలో 45వేల బెల్ట్షాపులుండగా వాటిని పూర్తిగా రద్దు చేశామని మంత్రి పేర్కొన్నారు. తాము అధికారంలో వచ్చిన నాడు 4500 వైన్స్ దుకాణాలు ఉండగా దానిని 2900కు కుదించామని తెలిపారు.