అమరావతి : ఏపీలో రాజ్యసభ అభ్యర్థిగా జనసేనకు చెందిన లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) శనివారం నామినేషన్ ( Nomination ) దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలపై ఆరుగురు జనసేన, ముగ్గురు టీడీపీ, ఒకరు బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. నామినేషన్ల పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.
అనంతరం లింగమనేని రమేశ్ అభ్యర్థి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యత్వానికి కూటమి తరుఫున అవకాశమిచ్చిన జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామానికి చెందిన లింగమనేని జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.