శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా రెండు సంవత్సరాలు విధులు నిర్వహించిన కేఎస్ రామారావును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలుడ్డాయి. ప్రస్తుతం కడప మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ లవన్నను శ్రీశైల దేవస్థానం నూతన ఈవోగా నియమించినట్లు ఉత్తర్వులలో పేర్కోన్నారు.