అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు. పశువులు అనారోగ్యానికి గురైతే టోల్ప్రీ నంబర్ 1962 అనే నంబర్ కు సంప్రదించాలని సీఎం పాడి యజమానులకు సూచించారు. . తొలి విడతలో నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించామని, మొదటి దశలో రూ. 143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్లను కొనుగోలు చేశామని సంబంధిత అధికారులు తెలిపారు.
రెండో దశలో రూ. 135 కోట్లతో మరో 165 అంబులెన్స్ల కొనుగోలు చేస్తామని వెల్లడించారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసే ల్యాబ్ను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి సీడరి అప్పల రాజు, అధికారులు పాల్గొన్నారు.