తిరుమల : గతేడాది తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా హుండీ (Hundi ) ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజులపాటు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనం పూర్తయింది . డిసెంబరు 23 నుంచి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darsan) సోమవారం రాత్రితో ముగిసింది. అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాల్ని మూసివేశారు.
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు సోమవారం సాయంత్రానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని పది కంపార్ట్మెంట్లలో వేచి యుండగా మంగళవారం తెల్లవారుజాము నుంచి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ద్వారా దర్శనానికి 7,76,930 టోకన్లు జారీ చేశమని పేర్కొన్నారు. గతేడాది 6 లక్షల 9 వేల మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటే, ఈ ఏడాది 6,47,452 మంది భక్తులు స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారన్నారు. ఈ ఏడాది 40 వేల మంది భక్తులు అదనంగా స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా పదిరోజుల్లో హుండీ ఆదాయం అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 40.20 కోట్లు హుండీ కానుకలు వచ్చాయని వివరించారు. 35.60 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించామని, 2.13 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.