తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఆలయంలో లక్ష కుంకుమార్చననను వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం లక్ష కుంకుమార్చన నిర్వహంచారు.
గృహస్తులు రూ.1,116 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేశారు. కాగా రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తామని వేదపండితులు తెలిపారు.