చిత్తూరు: కుప్పం ప్రజలు వైసీపీ రౌడీయిజానికి.. బెదిరింపులకు.. భయపడేవారుకారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర ఏండ్లుగా అభివృద్ధి చేయని ప్రభుత్వం, అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని వివరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తనపై 11 కేసులు పెట్టారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని, వాటిని ఎదుర్కొనడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. వైసీపీ నాయకుల మాదిరిగా దోచుకోవడం, జైళ్లకు వెళ్లడం తమకు అలవాటు లేదని అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఉన్న 25వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి వైసీపీని ఓడించి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.