అమరావతి : తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2లక్షలకుపైగా విలువైన మద్యాన్ని ఆదివారం కృష్ణా జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం రవాణా అవుతున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందింది.
దీంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలు ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు.
కార్టన్లలో 1,766 మద్యం సీసాలున్నాయని.. వీటి విలువ రూ. రూ. 2,14,560 వరకు ఉంటుందని తెలిపారు. లారీ కోదాడ నుంచి ఉయ్యూరుకు వెళ్తున్నట్లు చెప్పారు.
లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన మద్యాన్ని జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి