హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ (జేసీ) అపరాజితసింగ్ సిన్వర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన అపరాజిత అదే రాష్ర్టానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్రకుమార్ను వివాహమాడారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
హంగూఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో దండలు మార్చుకున్నారు. యూపీ క్యాడర్కు చెందిన దేవేంద్రకుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహానంతరం నూతన దంపతులు వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కొత్త జంటకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతాధికారులుగా ఇలా సాధారణ వివా హం చేసుకోవడం చర్చనీయాంశమైంది.