కోనసీమ జిల్లా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లా పేరును డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. ఈ మేరకు ప్రాథమిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో రెండు నెలల క్రితం జిల్లాల విభజన జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి, వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి మహనీయుల పేర్లను పెట్టింది.
ఈ కోవలోనే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్లు చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అధికారికంగా ఉత్తర్వులు మాత్రం ఇంకా రావాల్సి వుందని అధికారులు పేర్కొంటున్నారు.