తిరుపతి : తిరుపతి (Tirupati) లో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు సోమవారం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సీత లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారధి, భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 73,801 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 23,055 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.72 కోట్లు వచ్చిందని వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు.