అమరావతి : ఏపీలో మారుతున్న రాజకీయ వ్యూహరచనలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Mla Kodali Nani) తనదైన శైలీలో ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు. తన వ్యంగ్యస్త్రాలతో ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్న నాని ఈసారి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu), ఆయన కుమారుడు లోకేశ్ (Lokesh) పై ఘటైన విమర్శలు చేస్తూనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిషోర్(Prashant Kishore) భేటిపై ఆరోపణలు చేశారు.
ఏపీలో చంద్రబాబు ఔట్డేటెడ్ పొలిటీషియన్ అని, ఎంతమంది వ్యూహకర్తలు వచ్చి ప్రచారాలు చేసినా వైఎస్ జగన్ను విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే బాబాయ్ వైఎస్ వివేక్ను చంపారని, జగన్ కోడి కత్తి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించిన చంద్రబాబు మళ్లీ పీకేతో జతకట్టడం రాజకీయ అనైతికతకు నిదర్శమని ఆరోపించారు.
గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మేధస్సునంతా వాడుకున్నామని, ప్రస్తుతం ఆయన దగ్గర ఏమి లేదని వ్యాఖ్యానించారు. ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ ఏపీకి వచ్చి చంద్రబాబుతో కలిసారని వెల్లడించారు.