శ్రీశైలం: శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసోత్సవాల సందర్భంగా శ్రీగిరీశుడు మల్లికార్జున స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలంయంలోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తిక దీపారాధనలు చేస్తున్నారు.