తిరుమల : తిరుమలలోని శ్రీవారిని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికా రులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలనంతరం వేదపండితులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో నిర్మాణం లో ఉన్న కర్ణాటక భవనాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారావు తో కలిసి పరిశీలించారు.
2020 సంవత్సరంలో కర్ణాటక భవనానికి శంకుస్థాపన చేయగా భవన నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తామని చైర్మన్ వివరించారు. ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణం ఆలస్యమైందని, ఐదు నెలల్లో కల్యాణ మండపం, మొదటి భవనాన్ని పూర్తి చేస్తామని సీఎంకు వెల్లడించారు.