అమరావతి : ఏపీ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) జనసేనలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూతగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన (Janasena) ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకులు శుక్రవారం ముద్రగడ నివాసానికి వెళ్లి రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు.
శనివారం కూడా మరోసారి భేటీ అయిన బొలిశెట్టి మీడియాతో మాట్లాడారు. జనసేనలో ముద్రగడ చేరడం ఖాయమని, త్వరలో పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరిచారని వెల్లడించారు. పవన్కల్యాణ్ కూడా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారని వివరించారు.ఈ నెల 20, 23న జనసేనలోకి చేరే అవకాశముందని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖుల చేరికలు, రాజీనామాలు చర్చంశనీయంగా మారుతున్నాయి .