Kapu Ramchandra Reddy | ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి షాక్ తగిలింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కళ్యాణదుర్గం నుంచి టికెట్ నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా లేదా మరో పార్టీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. రాయదుర్గం నుంచి తాను పోటీ చేస్తానని, కళ్యాణదుర్గం నుంచి తన భార్య ఇండిపెండెంట్గా లేదా మరో పార్టీ నుంచి పోటీచేస్తామని ప్రకటించారు.
సర్వేల పేరుతో తన గొంతు కోశారని, తమను ఇంత మోసం చేస్తారని అనుకోలేదంటూ వాపోయారు. టికెట్ ఇవ్వని పార్టీకి నా సత్తా ఏంటో చూపిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాను సీఎం జగన్ మాట మీరలేదన్న ఆయన.. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కాపు రాంచంద్రారెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవమానం తమకు ఎప్పుడూ జరగలేదని అన్నారు.