అమరావతి : కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామానికి చెందిన చెందిన వెంకటేశ్ అనే యువకుడు కువైట్ సెంట్రల్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారాన్ని ధ్రువీకరించుకున్న భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత నెల 25న ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి నగదు, బంగారు దోచుకున్నాడని అక్కడి పోలీసులు ఆరోపిస్తు అతడిపై కేసు నమోదు చేశారు. వెంకటేశ్ను 21 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
జైలులో ఉన్న వెంకటేశ్ తన ఒంటిపై ఉన్నదుస్తులతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కువైట్లో ఉన్న బంధువుల సహకారంతో ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. వెంకటేశ్ భార్య స్వాతి మాట్లాడుతూ తన భర్త ఎలాంటి నేరం చేయలేదని, కువైట్ ప్రభుత్వమే తన భర్తపై నేరం మోపుతూ జైలులో పెట్టిందని రోదించారు.