అమరావతి: సలహాదారులను నియమించే ప్రక్రియ ఏపీలో కొనసాగుతున్నది. తాజాగా జ్వాలాపురం శ్రీకాంత్ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జ్వాలాపురం శ్రీకాంత్ అనంతపురం వాసి. ఈ పదవిలో శ్రీకాంత్ రెండేండ్లపాటు కొనసాగుతారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం పలువుర్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన విషయం తెలిసిందే.
ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడుగా కూడా సేవలందిస్తున్న జ్వాలాపురం శ్రీకాంత్.. గత ప్రభుత్వ హయాంతో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్కు అనంతపురం నగర పాలక సంస్థ ప్రతినిధిగా కొనసాగారు. 2019 లో వైసీపీలో చేరిన శ్రీకాంత్కు ఏపీకి చెందిన ఓ గురువు కారణంగా పదవి దక్కిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ సలహాదారుగా నియమితులైన శ్రీకాంత్కు ఏ మేర జీతభత్యాలు ఇవ్వనున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, రూ.5 లక్షల ఆదాయం దాటిన ఆలయాల పరిపాలనా నిధి వసూలు చేసే 8 శాతం నుంచి ఆయనకు దాదాపు రూ.లక్షన్నర మేర జీతభత్యాలు ఇవ్వనున్నట్లు సమాచారం.