అమరావతి : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి రమ్య దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ ఫాస్ట్ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును మృతురాలి తల్లిదండ్రులు స్వాగతించారు. ఈ సందర్భంగా పోలీసులు, న్యాయవ్యవస్థకు వారు ధన్యవాదాలు తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష వేసినందుకు తమకు న్యాయం జరిగిందని భావిస్తున్నానని రమ్య తండ్రి పేర్కొన్నాడు.
సమాజంలో మహిళలపై దాడులకు పాల్పడ్డ మరికొందరికి ఇలాంటి శిక్ష పడితే నేరాలు తగ్గుతాయని అన్నారు. గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థి రమ్యతో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన శశికృష్ణ తనను ప్రేమించాలంటూ రమ్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో రమ్య అతడి ఫోన్ నంబర్ను బ్లాక్లీస్ట్లో పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు 2021లో నడిరోడ్డుపై రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో నిందితుడు కుంచాల శశికృష్ణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 9 నెలల పాటు విచారించి ఇవాళ ఉరి శిక్ష ఖరారు చేసింది.