తిరుమల : సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Justice NV Ramana) మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల(Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు(Darsan) . ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు రమణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోగా , టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,731 మంది భక్తులు దర్శించుకోగా 25,156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చిందని వివరించారు.