అమరావతి : తెలంగాణలో జనసేన బలం తేలిపోయిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Amarnath) అన్నారు. తెలంగాణలో ఎక్కడ ఉంటాడు. ఏ నియోజకవర్గంలో ఉంటారో పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు తెలియదని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి ఆ పార్టీని సర్వనాశనం చేశాడని, ఏపీలో కూడా అదే పరిస్థితులు రావోచ్చని పేర్కొన్నారు.
ఓట్లను సాధించడంతో బర్రెలక్కతో జనసేన పోటీ పడిందని, కనీసం డిపాజిట్లు దక్కించుకోని దౌర్భాగ్య పరిస్థితి జనసేనకు దక్కిందని అన్నారు. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, వైఎస్ జగన్పై విమర్శలు చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఏపీలో 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమాను వ్యక్తం చేశారు.