Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి ర్యాలీగా వెళ్లి.. పిఠాపురం ఎంపీపీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అందజేసిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు.
గత ఐదేండ్లలో రూ.114.76 కోట్లు సంపాదించానని ఇవాళ ఈసీకి అందజేసిన అఫిడవిట్లో పొందుపరిచారు. తనకు రూ.64 కోట్ల అప్పులు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453 కోట్లు కాగా, 15 మంది వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలు రూ.46.70 కోట్లు అని వివరించారు. ఈ 15 మందిలో పవన్ కల్యాణ్ వదిన కొణిదెల సురేఖ పేరు కూడా ఉండటం గమనార్హం. సురేఖ దగ్గర నుంచి రూ.2 కోట్ల మేర అప్పు తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో రూ.73.92 కోట్లు చెల్లించానని అఫిడవిట్లో వెల్లడించారు.
వివిధ సంస్థలు, జనసేన పార్టీ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం రూ.17.15 కోట్లు విరాళం అందించానని అఫిడవిట్లో పవన్ కల్యాణ్ తెలిపారు. వివిధ సంస్థలకు రూ.3.32 కోట్లు విరాళంగా అందజేశానని చెప్పారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ. కోటి, ఏపీసీఏంఆర్ఎఫ్ కోసం రూ.50 లక్షలు, తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కోసం రూ.50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు రూ.30.11 లక్షలు అందజేశానని పేర్కొన్నారు.
వీఆర్ విజయలక్ష్మీ – 8 కోట్లు
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ – 6.35 కోట్లు
లీడ్ ఐటీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ – 6 కోట్లు
ఎంవీఆర్ఎస్ ప్రసాద్ – 3.5 కోట్లు
యెర్నేని నవీన్ – 5.50 కోట్లు
ఎం.ప్రవీణ్కుమార్ – 3 కోట్లు
మైత్రీ మూవీ మేకర్స్ – 3 కోట్లు
శ్రీయశ్వంత్ ఫైనాన్షియర్స్ – 3కోట్లు
రాహుల్ కుందవరం – 2.80 కోట్లు
ఎంవీఆర్ఎస్ ప్రసాద్ – 2 కోట్లు
కొణిదెల సురేఖ -2 కోట్లు
కోటంరెడ్డి సాహిత్య రెడ్డి – 50 లక్షలు
లింగారెడ్డి లలిత – 50 లక్షలు
ఏ దయాకర్ – 45 లక్షలు
డీవీవీ ఎంటర్ప్రైజెస్ రూ.10 లక్షలు