అమరావతి : ఏపీలో ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకే ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఆరో పించారు. గడిచిన మూడు సంవత్సరాలలో మహిళలు, రైతులు, యువత జీవితాల వెలుగులను జగన్ పీకేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి , ప్రజల దృష్టి మళ్లించేందుకు దుర్భాష లాడుతున్నారని విమర్శించారు.
అత్యున్నత పదవిలో ఉండే వ్యక్తులు మాట్లాడవలసిన భాష ఇది కాదని వివరించారు. ప్రజావేదిక దగ్గర నుంచి పోలవరం వరకు ఏం చేశారో చెప్పాలని, రాష్ట్ర నిధులతో ఒక్కరోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ను అనుచిత వ్యాఖ్యలతో తాము కూడా అదేబాటలో పయనించవలసి వస్తుందని కేశవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని పీకేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.