అమరావతి : ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమ సంపాదనను వెలికితీసే పనిపై కేంద్రం దృష్టి పెట్టాలని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. స్వలాభం, పార్టీ ప్రయోజనాలపైనే దృష్టి సారించారని, వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ప్రజాతీర్పును కాలరాసేందుకే జగన్ రెడ్డి అవినీతి కుంభకోణాలకు అక్రమార్జనకు తెగబడ్డాడని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కేంద్రం ఇంకెన్నాళ్లు హెచ్చరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే ప్రకటలకే ఏపీ సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఏపీలో అధికారంలోకి రాలేననే అనుమానంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. ఉపాధి కల్పన శూన్యమని ఎద్దేవా చేశారు. బాధిత వర్గాల ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడం, ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై జగన్కు ఆసక్తి లేదని విమర్శించారు.